అన్నమయ్య: చిన్నమండెం కస్పాలో కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతన బోరు వేయించి, మోటార్ అమర్చి నీటిని విడుదల చేశారు. ప్రజల కోరిక మేరకు తక్షణ చర్యలు తీసుకున్నామని, ప్రతి గ్రామంలో నీటి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.