చిత్తూరు: సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో గుడిపల్లిలో పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. 30 ఎకరాలలో 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. రైతులు పవర్ ప్లాంట్ నిర్మాణానికి భూమిని ఇచ్చి అభివృద్ధిలో భాగమవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ వెల్లడించారు.