VZN: విజయనగరం జిల్లాలో మొత్తం 507 RSK ల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ మీనాకుమారి తెలిపారు. నేటివరకు 459 RSKల ద్వారా 33,488 మంది రైతుల వద్ద నుంచి 1.57,846 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యమునకు గాను రూ.355 కోట్లను రైతులకు చెల్లించామని చెప్పారు.