సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడు రోజుల జిల్లా పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు చేరుకుని, అక్కడ ప్యాలెస్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి రోడ్డు మార్గంలో ధర్మవరం చేరుకుని అక్కడే బస చేస్తారు. 29న రోజంతా ధర్మవరంలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని, సాయంత్రం రైలులో గుంటూరుకు బయలుదేరుతారు.