E.G: మత్స్యకార సహకార సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కలెక్టర్ కీర్తి చేకూరికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పోలీసు ఒత్తిళ్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. అనంతరం ఎస్పీని కలిసి హైకోర్టు ఉత్తర్వులతోపాటు వినతి పత్రాన్ని అందజేశారు.