ELR: పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోనికి తీసుకొని, వారు దొంగతనాలకు వినియోగిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు భీమడోలు ఎస్సై సుధాకర్ తెలిపారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వాహనాల తనిఖీలు చేశారు. పశువుల దొంగతనాల్లో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు.