AKP: ఎస్కార్ట్ సమయంలో నిందితుడు పరారైన ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎఆర్, లా అండ్ ఆర్డర్ సిబ్బందికి కఠిన సూచనలు జారీ చేశారు. మంగళవారం అనకాపల్లి కార్యాలయంలో ఆయన మాట్లడారు. నిందితుల కేసులు, చరిత్రపై సిబ్బందికి ముందస్తు అవగాహన ఉండాలని, రిమాండ్ ఖైదీలు, కరడుగట్టిన నేరస్థులకు అదనపు భద్రత తప్పనిసరి అని తెలిపారు.