KRNL: చిగిలిలో నీటి కుంటలో పడి మృతి చెందిన ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షలు చొప్పున మంజూరయ్యాయి. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సిఫారసుతో ఈ సాయం లభించింది. ఆదివారం ఎంపీ కార్యాలయంలో చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. పిల్లలను కోల్పోయిన వారి బాధను ఎవ్వరూ తీర్చలేరని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.