ప్రకాశం: అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ రాజా బాబు ఆదేశించారు. సోమవారం ఒంగోలులోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన మీ కోసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఫిర్యాదుదారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.