SKLM: ప్రజలకు న్యాయ వ్యవస్థ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని ఆయన కార్యాలయంలో పారా లీగల్ వాలంటీర్స్తో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పారా లీగల్ వాలంటీర్స్ క్షేత్ర స్థాయిలో పని చేయాలని కోరారు.