CTR: చిత్తూరు డీఈవోగా పనిచేసిన రాజేంద్రప్రసాద్ సేవలు ప్రశంసనీయమని డీఆర్వో మోహన్ కుమార్ తెలిపారు. జడ్పీ సమావేశ మందిరంలో డీఈవో పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఆయనను పలువురు విద్యాశాఖ అధికారులు, టీచర్లు ఘనంగా సన్మానించారు. విద్యారంగంలో నిస్వార్థమైన సేవలు అందించడంతోపాటు, పరిపాలనాపరంగా తనదైన ముద్రను చూపారని కొనియాడారు.