VZM: 1వ పట్టణ పోలీసు స్టేషన్లో 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విశాఖపట్టణం జిల్లా పద్మనాభం మండలం పొట్నూరు గ్రామానికి చెందిన అప్పలనాయుడుకు 20ఏళ్ల కఠిన కారాగార శిక్షను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. మెంటాడకు చెందిన ఒక బాలికను ప్రేమ పేరిట శారీరకంగా అనుభవించి మోసం చేశాడనే ఫిర్యాదుతో పొక్సో కేసు నమోదైందన్నారు.