CTR: జ్వరం బారిన పడిన చిన్న పిల్లల కోసం పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు. ప్రస్తుతం కురుసిన వర్షాల నేపథ్యంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వైద్య సేవలు అందిస్తామన్నారు.