VSP: భీమిలి సమీపంలోని చంద్రంపాలెంకు చెందిన జీ. మోజేస్ (16) అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదో తరగతి ఫెయిలై అల్లరిగా తిరుగుతున్న మోజేస్ను తల్లి మంగళవారం రాత్రి మందలించింది. దాన్ని అవమానంగా భావించి, మనస్తాపం చెందాడు. దీంతో ఇంటి డాబాపై గల షెడ్లో చీరతో ఉరివేసుకుని చనిపోయాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.