SDPT: జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు సిద్దిపేట విద్యార్థిని ఎంపికైంది. నల్గొండలో జరిగిన 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్ -17 బాల బాలికల టోర్నమెంట్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి మొత్తం 5 పతకాలు సాధించారు. అయితే వీరిలో బీ. విజ్ఞశ్రీ అండర్ – 32 కిలోల విభాగంలో స్వర్ణం సాధించి నేషనల్ టోర్నమెంట్ అర్హత సాధించినట్లు కోచ్ శ్రీనివాస్ తెలిపారు.