కృష్ణా: చల్లపల్లి మండలం మంగళాపురం పీఏసీఎస్లో రైతులకు 15.075 టన్నుల యూరియా సరఫరా చేశారు. ఏవో కే మురళీకృష్ణ మాట్లాడుతూ.. త్వరలో మిగిలిన రైతులకు కూడా సొసైటీ ద్వారా యూరియా అందిస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. సొసైటీలతో పాటు ప్రైవేట్ దుకాణాల ద్వారా యూరియా సరఫరా పెంచటానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.