SS: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండ్, సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఆస్తులు అన్యాక్రాంతమైతే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా సొంత నిధులతో పనులు చేస్తున్నట్లు చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని అన్నారు.