NDL: విజయవాడ క్యాంప్ ఆఫీసులో మంత్రి లోకేశ్ను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఆళ్లగడ్డలోని శిల్పాలను ప్రమోట్ చేసేందుకు ప్లానింగ్ గురించి ఆమె మంత్రికి వివరించారు. అలాగే, తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన కాంపౌండ్ వాల్స్, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.