సత్యసాయి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి వద్ద పెట్రోల్ బంకులో పంప్ బాయ్గా పనిచేస్తున్న ఫకృద్దీన్పై దాడి చేసినందుకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంక్ మేనేజర్ సత్యనారాయణ, పంప్ బాయ్లు అమర్నాథ్, మాబు, హరికృష్ణను నిందితులుగా చేర్చారు. బంక్ నిర్వహిస్తున్న హరిప్రసాద్, ఆయన తండ్రి వెంకటరమణపై కేసు నమోదు చేయలేదు.