TPT: తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం పరిశీలించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీనివాసపురం, ఓటేరు, పద్మావతిపురం, వేదాంతపురం పంచాయతీలలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేదాంతపురంలో మరో రెండు నీటి బోర్లు వేసి నీటి సమస్యను అధిగమించాలన్నారు.