ప్రకాశం: కనిగిరి మండలం పేరంగుడిపల్లి సమీపంలో గ్రానైట్ క్వారీల వద్ద నడికుడి-శ్రీ కాళహస్తి రైల్వే నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, రైల్వే అధికారితో కలిసి పరిశీలించారు. రైల్వే లైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.