కృష్ణా: బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణము, ఆధునికీకరణ చేయు పనులకు శంఖుస్థాపన కార్యక్రమంలో గురువారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే డిగ్రీ కళాశాలకు 5 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.