ప్రకాశం: దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ సీఎం జగన్ను కలిశారు. తన తల్లి వెంకాయమ్మతో కలిసి తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాజా రాజకీయ పరిణామాలను ఆయన అధినేతకు వివరించారు. పార్టీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వంపై పోరాట కార్యక్రమాలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జగన్ పలు సూచనలు చేశారు.