ELR: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి సార్వత్రిక ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులను, కార్యకర్తలను నేటికి గుర్తించక పోవడం వల్లనే ఆ పార్టీ సభ్యత్వానికి పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ సంకు నాగశేషు ప్రకటించారు. అనంతరం బుధవారం నిడమర్రు మండలం భువనపల్లిలో విలేకరులతో మాట్లాడారు.