PPM: అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలు విజేతలకు సోమవారం బహుమతులు అందజేశారు. పాలకొండ మండలం వెంకంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో రంగలక్ష్మి బహుమతులు ఇచ్చారు. వ్యాస రచనలో శ్రావణి, నిరోష, రాజ్యలక్ష్మి, రన్నింగ్లో చాందిని, ప్రీతి, షార్ట్ ఫుట్లో దుర్గా చాందిని, విజేతలుగా నిలిచారు.