PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన వినతులు సత్వరమే పరిష్కారం కావాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి పనికిరాదని అధికారులకు స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది.