CTR: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమానుపల్లెకు చెందిన రోజా 2022లో బీఎస్ఎఫ్ జవానుగా ఎంపికయ్యారు. పంజాబ్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె.. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధుల్లో ఉన్నారు. జవానుగా దేశ సరిహద్దుల్లో రక్షణ బాధ్యతల్ని నిర్వహిస్తూనే.. మెగా DSC కోసం కష్టపడి చదివింది. ఈ మేరకు డీఎస్సీ పరీక్షలో 83.16 మార్కులు సాధించి ఉపాధ్యాయురాలైంది.