PLD: గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికులకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈనెల 23న పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీహెచ్సీ. వైద్యాధికారి డాక్టర్ విద్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈసీజీ రక్త పరీక్షలు, నిర్వహిస్తారని డాక్టర్ తెలిపారు.