VSP: విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పీ.వీ.జీ.డీ. ప్రసాద రెడ్డి తన కుటుంబంతో కలిసి శ్రీ కనకమహాలక్ష్మి గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.