ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా కార్య దర్శి సుందర రామిరెడ్డి తెలిపారు. ఈ జట్టు రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటుందన్నారు. ఎంపికైన క్రీడాకారులు మార్చి 6, 7, 8 తేదీలలో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరిగే పోటీలలో పాల్గొంటున్నారు.