NDL: రాష్ట్రంలో గ్రామీణ రహదారులు, వంతెనల నిర్మాణాలు, మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1,085 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వేర్వేరు జీవోలు జారీ చేశామన్నారు. పనులు సకాలంలో పూర్తిచేయడానికి నాలుగు క్వార్టర్ల నిధులను ఒకేసారి కేటాయించామని, ప్రణాళిక ప్రకారం విభాగాధిపతులు నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు.