PLD: రెంటచింతల మండలంలోని దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం రూ. 3 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఇందులో భాగంగా పాలువాయి, తుమృకోట, పశర్లపాడు రహదారులకు రూ. 2.90 కోట్లు, అణుపు రోడ్డుకు రూ. 10 లక్షలు కేటాయించారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలపడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.