W.G: అరుణాచల గిరి ప్రదక్షిణకు ఈ నెల 13వ తేదీన తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు బయల్దేరుతుందని డిపో మేనేజర్ వై. సత్యనారాయణమూర్తి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం ఆలయాలను దర్శించి 15వ తేదీన ఉదయం 2 గంటలకు అరుణాచలం చేరుతుందన్నారు. తిరిగి 16వ తేదీన తాడేపల్లిగూడెం చేరుతుందన్నారు.