కృష్ణా: గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి బుధవారం తరలించారు. ముసునూరు చెరువు వద్ద గుర్తు తెలియని వృద్ధుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వృద్ధుడి ఎవరు? మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు.