SKLM: ఎచ్చెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్పంచులు పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీపీ మొదలువలస చిరంజీవి జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీపీడీపీ ప్లాన్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల పరిపాలన హక్కులు, పరిమితులపై అవగాహన పెంచుకోవాలన్నారు.