E.G: ఈనెల 12వ తేదీ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో శ్రీకాకుళం ఎస్సైపై దాడి చేసి పరారైన 18 మందిలో 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు ముద్దాయిలు ఇంకా పరారీలోనే ఉన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు వివరాలు వెల్లడించారు.