SKLM: ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో మురుగు కాలువలు చెత్త, వ్యర్థాలతో పేరుకుపోయి దుర్వాసన వస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దుర్వాసనతో పాటు దోమల బెడద రాత్రిళ్లు అధికమైందని అంటున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, తాగు నీటి కుళాయిలు, బావుల వద్ద బ్లీచింగ్ పౌడర్ను చల్లి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.