TPT: తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ వద్ద గరుడ వారధి ఫ్లై ఓవర్పై బైక్ డివైడర్ని ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలు అయ్యాయి. ఇందులో భాగంగా ఓ కళాశాలలో చక్రధర్ (19), వేదాంత్ డిగ్రీ చదువుతున్నారు. బైకుపై వెళ్తున్న ఇద్దరు అదుపుతప్పి డివైడర్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో చక్రధర్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.