CTR: పుంగనూరు మండలం ఏ. కొత్తకోటకు చెందిన గంగాభవాని పురిటి నొప్పులతో పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో చేరింది. వైద్యులు మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఇందులో భాగంగా ఆమె 108 వాహనంలో వెళుతూ… మార్గమధ్యలో భీమగానిపల్లి క్రాస్ వద్ద మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటి నాగభూషణం, పైలట్ గోవర్ధన్ తెలిపారు.