విజయనగరం: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కిచ్చాడ గ్రామంలో 100 రోజులు ప్రభుత్వ కార్యక్రమాలు ఇంటింటికీ వెళ్లి తెలియజేశారు. అనంతరం గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు, టీడీపీ మండల కన్వీనర్ కేవీ కొండయ్య, టీడీపీ నాయకులు సుకేష్ చంద్రపండ, కర్రీ శ్రీనివాసరావు ,ఆకుల రమేష్ పాల్గొన్నారు.