VZM: పైడితల్లమ్మ అమ్మవారి ఉత్సవాలు సందర్బంగా పోలీస్ శాఖ ఏర్పాటుచేస్తున్న బందోబస్తు, భద్రత ఏర్పాట్లను విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఎస్పీ ఏ.ఆర్.దామోదర్తో కలిసి క్షేత్రస్థాయిలో గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ.. అమ్మవారి పండగ ఉత్సవాలకు, అధిక సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.