ATP: రాయదుర్గం మండలం వేపరాళ్ల వద్ద విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం నీటి కుంటలోకి వెళ్లిన పదో తరగతి విద్యార్థి శరత్ ప్రమాదవశాత్తు మునిగి మరణించాడు. కోనాపురం గ్రామానికి చెందిన ఈ విద్యార్థి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో శోకసంద్రం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.