ASR: షెడ్యూల్ ప్రాంతంలో 100శాతం ఉద్యోగ నియామక చట్టం చేయాలని ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు ధర్మన్నపడాల్, రామకృష్ణ కోరారు. ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని కోరారు. ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ జూన్ 4వరకూ నిర్వహిస్తున్న జీపు యాత్ర విజయవంతం చేయాలన్నారు. ఈమేరకు ఆదివారం జీ.మాడుగులలో జీపు యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.