PPM: పార్వతీపురం మండలంలోని చినబొండపల్లి గ్రామంలో ఉన్న ఊర చెరువు ఆక్రమణకు గురైంది. ఈ చెరువు కిందసుమారు 205 ఎకరాల ఆయుకట్టు ఉంది. చెరువుగట్టుపై స్థానికులు పశువులు శాలలు ఇంటి నిర్మాణాలు చేపట్టి చెరువుగట్టును ఆక్రమించారు. రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.