GNTR: నగరంలో స్థానిక బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర గుంటూరు తూర్పు వైసీపీ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా శంకుస్థాపన చేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నూతన కార్యాలయ నిర్మాణం జరుగుతుందని తూర్పు వైసీపీ ఇంఛార్జ్ నూరి ఫాతిమా తెలిపారు. కార్యక్రమంలో పలు డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.