KRNL: బీసీల ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ చేపట్టిన 5 ప్రధాన డిమాండ్లకు కర్నూలు జిల్లా బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల కేటాయింపు, సమగ్ర కులగణన చేపట్టడం, చట్టసభలు, ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.