NLR: ఆనం సంజీవరెడ్డి సోమశిల హైలెవెల్ కెనాల్ను పూర్తిచేసి మెట్ట ప్రాంతమైన మర్రిపాడు మండలానికి సోమశిల జలాలు తీసుకురావడానికి దృఢ సంకల్పంతో పని చేస్తున్నామని మంత్రి ఆనం పేర్కొన్నారు. మంగళవారం పొంగూరు రిజర్వాయర్ను మంత్రి సందర్శించారు. 2026 మార్చ్ లోగా మొదటి విడత పనులను పూర్తి చేసి పడమటి నాయుడు పల్లి, పొంగూరు మొదలగు ప్రాంతాలకు సోమశిల జలాలను తరలిస్తామన్నారు.