ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సీట్లు కేటాయించామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి గురువారం తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 19వ తేదీ శుక్రవారం కళాశాలకు వచ్చి రిపోర్టు చేయాలన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీల్లో చేరేందుకు పలువురు విద్యార్థులు ధరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.