కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.3,57,817 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 566 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే, 21 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. 4100 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.