విజయనగరం: సచివాలయం ANMలపై పని ఒత్తిడి తగ్గించాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ వి.ఇందిర డిమాండ్ చేసారు. ఏఎన్ఎం యూనియన్ నాయకులుతో కలిసి శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయపార్వతికి వినతి పత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ఏఎన్ఎంలు సచివాలయంలో పనులు చేస్తూ, వైద్య శాఖ పనులు చెయ్యడం వలన ఒత్తిడి పెరిగి మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.